ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఎస్సారెస్సీ కెనాల్‌లో ప‌డిన కారు

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఎస్సారెస్సీ కెనాల్‌లో ప‌డిన కారు

  • IMG-20250308-WA0017బాలుడి మృతి, తండ్రి కూతురు గల్లంతు 
  • కాలువ నుంచి భార్యను కాపాడిన స్థానికులు
  • వ‌రంగ‌ల్ జిల్లా తీగ‌రాజుప‌ల్లి వ‌ద్ద ఘోర ప్ర‌మాదం
  • గల్లంతైన తండ్రి, కూతురు కోసం గాలింపు

 

అక్షరదర్బార్, వరంగల్:

మ‌హ‌బూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండ‌లం మేచ‌రాజుప‌ల్లి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన సోమార‌పు ప్ర‌వీణ్ (30)తోపాటు ఆయ‌న కూతురు ఎస్సారెస్పీ కెనాల్‌లో ప‌డి గ‌ల్లంత‌య్యారు. ఈ దుర్ఘటనలో ప్రవీణ్ కొడుకు చిన్నారి సాయివర్దన్ (2) మృతి చెందగా భార్య ను స్థానికులు కాపాడారు. వ‌రంగ‌ల్‌లో నివాసం ఉంటున్న ప్ర‌వీణ్ భార్య ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి వ‌రంగ‌ల్ నుంచి కారులో స్వ‌గ్రామానికి వెళ్తున్నారు. ఈక్ర‌మంలోనే సంగెం మండ‌లం తీగ‌రాజుప‌ల్లి వ‌ద్ద ప్ర‌మాద‌వ‌శాత్తు ఎస్సారెస్పీ కెనాల్‌లో వీరు ప్ర‌యాణిస్తున్న కారు ప‌డిపోయింది. దీంతో ప్ర‌వీణ్‌, ఆయ‌న భార్య, ఇద్ద‌రు పిల్ల‌లు నీటిలో మునిగిపోయారు. గ‌మ‌నించిన స్థానికులు తాడు సాయంతో భార్య‌ కృష్ణవేణిని కాపాడారు. అప్పటికే బాలుడు సాయివర్దన్ మరణించాడు. ప్రవీణ్, ఆయన కూతురు చైత్ర సాయి (4) కారు సహా నీటిలో గ‌ల్లంత‌య్యారు. డ్రైవింగ్ సమయంలో ప్రవీణ్ కు చెస్ట్ పెయిన్ రావడంతో కారు ప్రమాదవశాత్తు కెనాల్ లో పడిపోయినట్లు తెలుస్తుంది. పోలీసులు గల్లంతయిన తండ్రీ కూతురు కోసం గాలిస్తున్నట్లు సమాచారం. సోమారపు ప్రవీణ్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ అని తెలిసింది. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. వివిధ రాజకీయ పార్టీల నేతలు సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.IMG-20250308-WA0015

WhatsApp Image 2025-03-08 at 1.20.48 PM

Tags:

బిగ్ బ్రేకింగ్‌.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్

మాజీ జిల్లా రవాణాశాఖ అధికారి గౌస్ పాషా ఇంట్లో త‌నిఖీలు గ‌త సంవ‌త్స‌రం అవినీతి ఆరోప‌ణ‌ల‌పై డీటీవో సస్పెన్ష‌న్‌ సుమారు రూ. 3 కోట్ల‌పైనే అక్ర‌మాస్తులు.. అక్ష‌ర‌ద‌ర్బార్‌,...
క్రైమ్  వరంగల్ 
Read More...
బిగ్ బ్రేకింగ్‌.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్

నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

విచారణలో రుజువైన ఆరోపణ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెన్షన్  ఉత్తర్వులు జారీ చేసిన సీపీ
క్రైమ్ 
Read More...
నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

జిల్లా జడ్జీల బదిలీలు..

  హ‌న్మ‌కొండ‌, భూపాల‌ప‌ల్లి జ‌డ్జిలు సీహెచ్ ర‌మేష్‌బాబు, నారాయ‌ణ‌బాబుకు స్థాన‌చ‌ల‌నం ఉత్త‌ర్వులు జారీచేసిన హైకోర్టు అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మ‌కొండ‌: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 38 మంది జడ్జీలను...
వరంగల్ 
Read More...
జిల్లా జడ్జీల బదిలీలు..

గుండెపోటుతో ఎంపీడీవో మృతి

చికిత్స కోసం హైదరాబాద్ బయలుదేరగా మార్గమధ్యంలో గుండెపోటు వచ్చేనెల మే లో రిటైర్డ్ కానున్న ఎంపీడీవో
క్రైమ్ 
Read More...
గుండెపోటుతో ఎంపీడీవో మృతి

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు 

అక్షరదర్బార్, హనుమకొండ : హనుమకొండ జిల్లా హసన్‌ప‌ర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు అదుపుత‌ప్పి రోడ్డుపై బోల్తా పడింది. మంగ‌ళ‌వారం ఉద‌యం...
Read More...
ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు