తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు బిగ్ షాక్‌.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ స‌స్పెన్ష‌న్‌ 

తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు బిగ్ షాక్‌.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ స‌స్పెన్ష‌న్‌ 

అక్ష‌ర‌ద‌ర్బార్‌, హైద‌రాబాద్ : ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను స‌స్పెండ్ చేస్తూ పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఫిబ్ర‌వ‌రి 5న తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు క‌మిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్య‌తిరేక చ‌ర్య‌ల‌పై మ‌ల్ల‌న్న‌ను క‌మిటీ వివ‌ర‌ణ కోరింది. ఫిబ్ర‌వ‌రి 12వ తేదీలోపు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని మ‌ల్ల‌న్న‌కు క‌మిటీ గ‌డువు ఇచ్చింది. వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోవ‌డంతో తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం-న‌ల్ల‌గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మ‌ల్ల‌న్న ఇటీవ‌ల కాంగ్రెస్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ మల్లన్న కొంతకాలంగా వాయిస్ వినిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కులగణన నివేదికను బహిరంగంగా చించివేశారు. అలాగే ఇతర కులాలపై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌లో జరిగిన బీసీ సభలో ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై పీసీసీకి ఫిర్యాదులు అందాయి. దీంతో మల్లన్న వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపింది.  ఈ నేపథ్యంలోనే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులకు తీన్మార్ మల్లన్న స్పందించకపోవడంతో ఆయనను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.WhatsApp Image 2025-03-01 at 12.50.04 PM

Tags:

బిగ్ బ్రేకింగ్‌.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్

మాజీ జిల్లా రవాణాశాఖ అధికారి గౌస్ పాషా ఇంట్లో త‌నిఖీలు గ‌త సంవ‌త్స‌రం అవినీతి ఆరోప‌ణ‌ల‌పై డీటీవో సస్పెన్ష‌న్‌ సుమారు రూ. 3 కోట్ల‌పైనే అక్ర‌మాస్తులు.. అక్ష‌ర‌ద‌ర్బార్‌,...
క్రైమ్  వరంగల్ 
Read More...
బిగ్ బ్రేకింగ్‌.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్

నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

విచారణలో రుజువైన ఆరోపణ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెన్షన్  ఉత్తర్వులు జారీ చేసిన సీపీ
క్రైమ్ 
Read More...
నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

జిల్లా జడ్జీల బదిలీలు..

  హ‌న్మ‌కొండ‌, భూపాల‌ప‌ల్లి జ‌డ్జిలు సీహెచ్ ర‌మేష్‌బాబు, నారాయ‌ణ‌బాబుకు స్థాన‌చ‌ల‌నం ఉత్త‌ర్వులు జారీచేసిన హైకోర్టు అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మ‌కొండ‌: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 38 మంది జడ్జీలను...
వరంగల్ 
Read More...
జిల్లా జడ్జీల బదిలీలు..

గుండెపోటుతో ఎంపీడీవో మృతి

చికిత్స కోసం హైదరాబాద్ బయలుదేరగా మార్గమధ్యంలో గుండెపోటు వచ్చేనెల మే లో రిటైర్డ్ కానున్న ఎంపీడీవో
క్రైమ్ 
Read More...
గుండెపోటుతో ఎంపీడీవో మృతి

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు 

అక్షరదర్బార్, హనుమకొండ : హనుమకొండ జిల్లా హసన్‌ప‌ర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు అదుపుత‌ప్పి రోడ్డుపై బోల్తా పడింది. మంగ‌ళ‌వారం ఉద‌యం...
Read More...
ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు