కానిస్టేబుళ్ల ఆత్మహత్య

కానిస్టేబుళ్ల ఆత్మహత్య

  • ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ సూసైడ్
  • మృతుల్లో ఒకరు హెడ్ కానిస్టేబుల్ 
  • మరొకరు బెటాలియన్ కానిస్టేబుల్ 
  • మెదక్, సిద్దిపేట జిల్లాల్లో విషాదం

ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య
- మృతుల్లో ఒకరు హెడ్ కానిస్టేబుల్, మరొకరు కానిస్టేబుల్ 
- మెదక్, సిద్దిపేట జిల్లాల్లో విషాదం

అక్షరదర్బార్, మెదక్:
వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ఒకరు హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్, మరొకరు 17వ బెటాలియన్ కానిస్టేబుల్ బాలకృష్ణ. వివరాల్లోకి వెళితే... ఆదివారం ఉదయం మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ వద్ద హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెల్లవారుజామున వాకింగ్ కోసం ఇంటి నుంచి పోలీసు స్టేషన్ కు వచ్చిన సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు సాయికుమార్ తన కుమార్తెకు ఫోన్ చేశారు. హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ బలవన్మరణంపై మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి విచారణ చేపట్టారు. 

సిద్దిపేట వద్ద 17వ బెటాలియన్ కానిస్టేబుల్ బాలకృష్ణ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వీరిలో కానిస్టేబుల్ బాలకృష్ణ చనిపోయాడు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కానిస్టేబుల్ బాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇంటి కోసం బాలకృష్ణ అప్పు చేసినట్లు సమాచారం. హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఆత్మహత్యతో మెదక్, సిద్దిపేట జిల్లాల్లో విషాదం అలుముకుంది.IMG-20241229-WA0015

Tags:

జిల్లా జడ్జీల బదిలీలు..

  హ‌న్మ‌కొండ‌, భూపాల‌ప‌ల్లి జ‌డ్జిలు సీహెచ్ ర‌మేష్‌బాబు, నారాయ‌ణ‌బాబుకు స్థాన‌చ‌ల‌నం ఉత్త‌ర్వులు జారీచేసిన హైకోర్టు అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మ‌కొండ‌: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 38 మంది జడ్జీలను...
వరంగల్ 
Read More...
జిల్లా జడ్జీల బదిలీలు..

గుండెపోటుతో ఎంపీడీవో మృతి

చికిత్స కోసం హైదరాబాద్ బయలుదేరగా మార్గమధ్యంలో గుండెపోటు వచ్చేనెల మే లో రిటైర్డ్ కానున్న ఎంపీడీవో
క్రైమ్ 
Read More...
గుండెపోటుతో ఎంపీడీవో మృతి

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు 

అక్షరదర్బార్, హనుమకొండ : హనుమకొండ జిల్లా హసన్‌ప‌ర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు అదుపుత‌ప్పి రోడ్డుపై బోల్తా పడింది. మంగ‌ళ‌వారం ఉద‌యం...
Read More...
ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు 

అంజన్న దేవాలయంలో మహా అన్నదానం..

అంజన్న దేవాలయంలో మహా అన్నదానం..    అంజన్న ఆశీస్సులు తండా ప్రజలమీద ఉండాలి.    - మాజీ సర్పంచ్ భూక్యా రమేష్    అక్షర దర్బార్, శాయంపేట     అంజన్న ఆశీస్సులు తండా...
Read More...
అంజన్న దేవాలయంలో మహా అన్నదానం..

గొడ్డలితో నరికి చంపారు .. మానుకోట జిల్లాలో దారుణం

అక్ష‌ర‌ద‌ర్బార్‌, మ‌హబూబాబాద్‌: మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్య‌క్తి దారుణ హత్యకు గుర‌య్యాడు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని భజన తండా శివారులో టీ పార్థసారథి (42) అనే వ్యక్తిని...
క్రైమ్  వరంగల్ 
Read More...
గొడ్డలితో నరికి చంపారు .. మానుకోట జిల్లాలో దారుణం