ఎస్పీ, జ‌డ్జి చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకం.. ఎందుకంటే ?

ఎస్పీ, జ‌డ్జి చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకం.. ఎందుకంటే ?

అక్ష‌ర‌ద‌ర్బార్‌, మహబూబాబాద్ : జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్, న్యాయమూర్తి తిరుపతి చిత్రపటాలకు ఓ వ్య‌క్తి పాలాభిషేకం చేసి త‌న అభిమానం చాటుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సీటు ఇప్పిస్తానంటూ దళారి తీసుకున్న రెండు లక్షల  రూపాయలను తిరిగి ఇప్పించి లోక్ అదాలత్ లో ఇరువురి కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించినందుకు కృత‌జ్ఞ‌త‌గా మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఎదుట చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే..  కురవి మండలం గుండ్రాతి మడుగు (విలేజ్)కు చెందిన పత్తి  వెంకన్న తన కుమారుడికి హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సీటు కోసం మేడ్చల్‌కు చెందిన ఓ వ్య‌క్తికి రూ. 2 లక్షలు ఇచ్చాడు. సీటు ఇప్పించకపోగా తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో బాధితుడు కురవి పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేశారు. కురవి ఎస్ఐ సతీష్ బాధ్యతాయుతంగా స్పందించి దళారిని పోలీస్  స్టేషన్‌కు తీసుకువచ్చి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేశాడు. ఈమేర‌కు జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో ఇరువురి కక్షిదారుల మధ్య రాజీ కుదుర్చి డబ్బులను ఇప్పించి కేసు పరిష్కరించారు. పోయాయనుకున్న రెండు లక్షల రూపాయలను తిరిగి తనకు అందేలా చేసిన జిల్లా ఎస్పీ, న్యాయమూర్తిల చిత్రపటాలకు మహబూబాబాద్‌లోని కోర్టు ఎదుట బాధితుడు పత్తి వెంకన్న పాలాభిషేకం నిర్వహించి తన కృతజ్ఞత చాటుకున్నారు. 

Tags:

జిల్లా జడ్జీల బదిలీలు..

  హ‌న్మ‌కొండ‌, భూపాల‌ప‌ల్లి జ‌డ్జిలు సీహెచ్ ర‌మేష్‌బాబు, నారాయ‌ణ‌బాబుకు స్థాన‌చ‌ల‌నం ఉత్త‌ర్వులు జారీచేసిన హైకోర్టు అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మ‌కొండ‌: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 38 మంది జడ్జీలను...
వరంగల్ 
Read More...
జిల్లా జడ్జీల బదిలీలు..

గుండెపోటుతో ఎంపీడీవో మృతి

చికిత్స కోసం హైదరాబాద్ బయలుదేరగా మార్గమధ్యంలో గుండెపోటు వచ్చేనెల మే లో రిటైర్డ్ కానున్న ఎంపీడీవో
క్రైమ్ 
Read More...
గుండెపోటుతో ఎంపీడీవో మృతి

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు 

అక్షరదర్బార్, హనుమకొండ : హనుమకొండ జిల్లా హసన్‌ప‌ర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు అదుపుత‌ప్పి రోడ్డుపై బోల్తా పడింది. మంగ‌ళ‌వారం ఉద‌యం...
Read More...
ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు 

అంజన్న దేవాలయంలో మహా అన్నదానం..

అంజన్న దేవాలయంలో మహా అన్నదానం..    అంజన్న ఆశీస్సులు తండా ప్రజలమీద ఉండాలి.    - మాజీ సర్పంచ్ భూక్యా రమేష్    అక్షర దర్బార్, శాయంపేట     అంజన్న ఆశీస్సులు తండా...
Read More...
అంజన్న దేవాలయంలో మహా అన్నదానం..

గొడ్డలితో నరికి చంపారు .. మానుకోట జిల్లాలో దారుణం

అక్ష‌ర‌ద‌ర్బార్‌, మ‌హబూబాబాద్‌: మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్య‌క్తి దారుణ హత్యకు గుర‌య్యాడు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని భజన తండా శివారులో టీ పార్థసారథి (42) అనే వ్యక్తిని...
క్రైమ్  వరంగల్ 
Read More...
గొడ్డలితో నరికి చంపారు .. మానుకోట జిల్లాలో దారుణం