బిగ్ బ్రేకింగ్... ఎల్క‌తుర్తి ఎస్సైపై వేటు

బిగ్ బ్రేకింగ్... ఎల్క‌తుర్తి ఎస్సైపై వేటు

  • విధుల్లో నుంచి రాజ్‌కుమార్ స‌స్పెన్ష‌న్‌
  • ఉత్త‌ర్వులు జారీచేసిన సీపీ అంబ‌ర్ కిషోర్ ఝా 
  • ఎస్సైపై కొంత‌కాలంగా అవినీతి ఆరోప‌ణ‌లు
  • అక్ర‌మాస్తుల కూడ‌బెట్టార‌ని విమ‌ర్శ‌లు

అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మ‌కొండ‌: హ‌న్మ‌కొండ జిల్లా ఎల్క‌తుర్తి ఎస్సై రాజ్‌కుమార్‌పై వేటు ప‌డింది. విధుల్లో నుంచి ఆయ‌న్ను సస్పెండ్ చేస్తూ వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌నర్ అంబ‌ర్ కిషోర్ ఝా ఉత్త‌ర్వులు జారీచేశారు. ఎస్సై రాజ్‌కుమార్‌పై కొంత‌కాలంగా అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. భూత‌గాదాల్లో త‌ల‌దూర్చుతున్నాడ‌నే ఫిర్యాదులు సైతం ఉన్న‌తాధికారులకు చేరిన‌ట్లు స‌మాచారం. అంతేగాక‌.. ఇటీవ‌ల అక్ర‌మాస్తులు కూడబెట్టార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈనేప‌థ్యంలోనే ఎస్సైపై సస్పెన్ష‌న్ వేటుప‌డ‌టం డిపార్ట్‌మెంట్‌లో చ‌ర్చనీయాంశ‌మైంది. క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని మ‌రికొంద‌రిపైనా త్వ‌ర‌లోనే స‌స్పెన్ష‌న్ వేటు ప‌డే అవకాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎల్క‌తుర్తిలో ఎస్సైగా విధులు నిర్వ‌హించిన ఏ అధికారి కూడా స‌స్పెన్ష‌న్‌కు గురైన చ‌రిత్ర లేద‌ని.. ఇదే తొలిసారి అని స‌మాచారం.

Tags:

జిల్లా జడ్జీల బదిలీలు..

  హ‌న్మ‌కొండ‌, భూపాల‌ప‌ల్లి జ‌డ్జిలు సీహెచ్ ర‌మేష్‌బాబు, నారాయ‌ణ‌బాబుకు స్థాన‌చ‌ల‌నం ఉత్త‌ర్వులు జారీచేసిన హైకోర్టు అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మ‌కొండ‌: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 38 మంది జడ్జీలను...
వరంగల్ 
Read More...
జిల్లా జడ్జీల బదిలీలు..

గుండెపోటుతో ఎంపీడీవో మృతి

చికిత్స కోసం హైదరాబాద్ బయలుదేరగా మార్గమధ్యంలో గుండెపోటు వచ్చేనెల మే లో రిటైర్డ్ కానున్న ఎంపీడీవో
క్రైమ్ 
Read More...
గుండెపోటుతో ఎంపీడీవో మృతి

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు 

అక్షరదర్బార్, హనుమకొండ : హనుమకొండ జిల్లా హసన్‌ప‌ర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు అదుపుత‌ప్పి రోడ్డుపై బోల్తా పడింది. మంగ‌ళ‌వారం ఉద‌యం...
Read More...
ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు 

అంజన్న దేవాలయంలో మహా అన్నదానం..

అంజన్న దేవాలయంలో మహా అన్నదానం..    అంజన్న ఆశీస్సులు తండా ప్రజలమీద ఉండాలి.    - మాజీ సర్పంచ్ భూక్యా రమేష్    అక్షర దర్బార్, శాయంపేట     అంజన్న ఆశీస్సులు తండా...
Read More...
అంజన్న దేవాలయంలో మహా అన్నదానం..

గొడ్డలితో నరికి చంపారు .. మానుకోట జిల్లాలో దారుణం

అక్ష‌ర‌ద‌ర్బార్‌, మ‌హబూబాబాద్‌: మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్య‌క్తి దారుణ హత్యకు గుర‌య్యాడు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని భజన తండా శివారులో టీ పార్థసారథి (42) అనే వ్యక్తిని...
క్రైమ్  వరంగల్ 
Read More...
గొడ్డలితో నరికి చంపారు .. మానుకోట జిల్లాలో దారుణం