పరువు నష్టం దావా వేస్తా..

పరువు నష్టం దావా వేస్తా..

  • కొన్ని దొంగ యూట్యూబ్ ఛానెల్స్ బురద జల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి
  • కారకులను శిక్షించాలని ముఖ్యమంత్రికి లేఖ రాశా..
  • ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

అక్ష‌ర‌ద‌ర్బార్‌, హనుమకొండ: కొన్ని దొంగ యూట్యూబ్ ఛానెల్స్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మండిప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు అసమ్మతి ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం అవుతోందని, వారిపై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఇంటికి వెళ్లినట్టు జ‌రుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ముఖ్యమంత్రికి, మంత్రులపై అసమ్మతిగా ఉన్నామని నా ప్రమేయం లేకుండా ఫొటోతో ప్రచురించిన తీరును ఖండిస్తున్నానన్నారు. దీని వెనకాల ఉన్నవాళ్లను తప్పకుండా శిక్షించాల్సిందేనన్నారు. ఓ పార్టీ నాయకులు, వారు సంపాదించిన అక్రమ సంపాదనలో కొన్ని కోట్ల రూపాయలతో యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి జీతాల రూపంలో ఇస్తూ ప్రభుత్వంపై విషం చల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కోడిగుడ్డు పై ఈకలు పీకే చర్యలను ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు సహచర ఎమ్మెల్యేలు కలుసుకోవడంలో తప్పేముందని, వారేమైన బీఆర్ఎస్, బీజేపీ నేతల ఇంటికి వెళ్లారా అని ప్రశ్నించారు. దీన్ని భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నాలు చేస్తున్నారని. ఇలాంటి విషయాలపై సమగ్ర విచారణ జరిగిపి కారకులను శిక్షించాలని ముఖ్యమంత్రికి లేఖ రాశానన్నారు. ముఖ్యంగా ఆధారాలు లేకుండా చూపించిన కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పై కోర్టు ద్వారా పరువునష్టం దావాలు వేస్తున్నానని నాయిని స్పష్టం చేశారు.

 

Tags:

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఎస్సారెస్సీ కెనాల్‌లో ప‌డిన కారు

బాలుడి మృతి, తండ్రి కూతురు గల్లంతు  కాలువ నుంచి భార్యను కాపాడిన స్థానికులు వ‌రంగ‌ల్ జిల్లా తీగ‌రాజుప‌ల్లి వ‌ద్ద ఘోర ప్ర‌మాదం గల్లంతైన తండ్రి, కూతురు కోసం...
క్రైమ్  వరంగల్ 
Read More...
ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఎస్సారెస్సీ కెనాల్‌లో ప‌డిన కారు

చేప‌ల కోసం వెళ్లి ఇద్ద‌రి మృతి .. మానుకోట జిల్లాలో దారుణం 

అక్ష‌ర‌ద‌ర్బార్‌, మ‌హ‌బూబాబాద్‌:  చేప‌ల వేట‌కు వెళ్లి ఇద్ద‌రు మృతి చెందిన విషాద ఘ‌ట‌న మహ‌బూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లికుదురు మండ‌లం పెద్ద తండాకు చెందిన రాములు (50),...
క్రైమ్  వరంగల్ 
Read More...
చేప‌ల కోసం వెళ్లి ఇద్ద‌రి మృతి .. మానుకోట జిల్లాలో దారుణం 

21 మంది ఐపీఎస్ ల బదిలీ

సీపీలు, ఎస్పీలకు స్థానచలనం వరంగల్ సిపిగా సన్ ప్రీత్ సింగ్  రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా  కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం 
క్రైమ్ 
Read More...
21 మంది ఐపీఎస్ ల బదిలీ

వ‌రంగ‌ల్ సీపీగా స‌న్‌ప్రీత్‌సింగ్‌.. రామ‌గుండానికి అంబ‌ర్‌కోషోర్ ఝా బ‌దిలీ..

రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్‌ల ట్రాన్స్‌ఫ‌ర్‌.. ఉత్త‌ర్వులు జారీ.. అక్ష‌ర‌ద‌ర్బార్‌, వ‌రంగ‌ల్‌:  రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈమేర‌కు రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసింది....
వరంగల్ 
Read More...
వ‌రంగ‌ల్ సీపీగా స‌న్‌ప్రీత్‌సింగ్‌.. రామ‌గుండానికి అంబ‌ర్‌కోషోర్ ఝా బ‌దిలీ..

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం

అక్షర దర్బార్, వరంగల్ : వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. కోనాపురం శివారు వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీ...
Read More...
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం