వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

  • నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ రైడ్స్‌.. అరెస్ట్‌
  • ఇవాళ ర‌వాణాశాఖ జిల్లా అధికారి ల‌క్ష్మి బ‌దిలీ 
  • ఉత్త‌ర్వులు జారీచేసిన ఉన్న‌తాధికారులు
  • ఇన్‌చార్జి డీటీవోగా ఎంవీఐ శోభన్ బాబుకు అదనపు బాధ్యతలు 
  • అవినీతికి అడ్డాగా వరంగల్ రవాణాశాఖ కార్యాలయం !
  • దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగిన ప్ర‌భుత్వం..

అక్ష‌ర‌ద‌ర్బార్‌, వ‌రంగ‌ల్‌: వరంగల్ రవాణాశాఖ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే రవాణా శాఖ కార్యాలయ పక్షాళ‌నపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిన్న డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి కోట్లల్లో అక్రమస్తులు కూడ‌పెట్టినట్లు గుర్తించి ఆయ‌న్ను అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న మ‌ర‌వ‌క ముందే ఇవాళ వ‌రంగ‌ల్ డీటీవోగా పని చేస్తున్న లక్ష్మీపై వేటు ప‌డింది. హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయంలో ఆమెను రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. విధుల్లో నిర్లక్ష్యం వ‌హించ‌డంతోపాటు అవినీతి ఆరోపణల నేప‌థ్యంలో డీటీవోపై వేటు వేసినట్లు తెలుస్తోంది. గతంలో డీటీవో లక్ష్మికి వరంగల్ కలెక్టర్ నుంచి షోకాస్ నోటీసులు సైతం అందాయి. తాజాగా ఆమెను డీటీవోగా తప్పిస్తూ ఉత్తర్వులు జారీకావడం కలకలం రేపుతోంది. వరంగల్ ఇన్‌చార్జి డీటీవోగా ఎంవీఐ శోభన్ బాబుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

Tags:

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఎస్సారెస్సీ కెనాల్‌లో ప‌డిన కారు

బాలుడి మృతి, తండ్రి కూతురు గల్లంతు  కాలువ నుంచి భార్యను కాపాడిన స్థానికులు వ‌రంగ‌ల్ జిల్లా తీగ‌రాజుప‌ల్లి వ‌ద్ద ఘోర ప్ర‌మాదం గల్లంతైన తండ్రి, కూతురు కోసం...
క్రైమ్  వరంగల్ 
Read More...
ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఎస్సారెస్సీ కెనాల్‌లో ప‌డిన కారు

చేప‌ల కోసం వెళ్లి ఇద్ద‌రి మృతి .. మానుకోట జిల్లాలో దారుణం 

అక్ష‌ర‌ద‌ర్బార్‌, మ‌హ‌బూబాబాద్‌:  చేప‌ల వేట‌కు వెళ్లి ఇద్ద‌రు మృతి చెందిన విషాద ఘ‌ట‌న మహ‌బూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లికుదురు మండ‌లం పెద్ద తండాకు చెందిన రాములు (50),...
క్రైమ్  వరంగల్ 
Read More...
చేప‌ల కోసం వెళ్లి ఇద్ద‌రి మృతి .. మానుకోట జిల్లాలో దారుణం 

21 మంది ఐపీఎస్ ల బదిలీ

సీపీలు, ఎస్పీలకు స్థానచలనం వరంగల్ సిపిగా సన్ ప్రీత్ సింగ్  రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా  కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం 
క్రైమ్ 
Read More...
21 మంది ఐపీఎస్ ల బదిలీ

వ‌రంగ‌ల్ సీపీగా స‌న్‌ప్రీత్‌సింగ్‌.. రామ‌గుండానికి అంబ‌ర్‌కోషోర్ ఝా బ‌దిలీ..

రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్‌ల ట్రాన్స్‌ఫ‌ర్‌.. ఉత్త‌ర్వులు జారీ.. అక్ష‌ర‌ద‌ర్బార్‌, వ‌రంగ‌ల్‌:  రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈమేర‌కు రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసింది....
వరంగల్ 
Read More...
వ‌రంగ‌ల్ సీపీగా స‌న్‌ప్రీత్‌సింగ్‌.. రామ‌గుండానికి అంబ‌ర్‌కోషోర్ ఝా బ‌దిలీ..

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం

అక్షర దర్బార్, వరంగల్ : వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. కోనాపురం శివారు వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీ...
Read More...
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం