వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

  • నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ రైడ్స్‌.. అరెస్ట్‌
  • ఇవాళ ర‌వాణాశాఖ జిల్లా అధికారి ల‌క్ష్మి బ‌దిలీ 
  • ఉత్త‌ర్వులు జారీచేసిన ఉన్న‌తాధికారులు
  • ఇన్‌చార్జి డీటీవోగా ఎంవీఐ శోభన్ బాబుకు అదనపు బాధ్యతలు 
  • అవినీతికి అడ్డాగా వరంగల్ రవాణాశాఖ కార్యాలయం !
  • దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగిన ప్ర‌భుత్వం..

అక్ష‌ర‌ద‌ర్బార్‌, వ‌రంగ‌ల్‌: వరంగల్ రవాణాశాఖ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే రవాణా శాఖ కార్యాలయ పక్షాళ‌నపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిన్న డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి కోట్లల్లో అక్రమస్తులు కూడ‌పెట్టినట్లు గుర్తించి ఆయ‌న్ను అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న మ‌ర‌వ‌క ముందే ఇవాళ వ‌రంగ‌ల్ డీటీవోగా పని చేస్తున్న లక్ష్మీపై వేటు ప‌డింది. హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయంలో ఆమెను రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. విధుల్లో నిర్లక్ష్యం వ‌హించ‌డంతోపాటు అవినీతి ఆరోపణల నేప‌థ్యంలో డీటీవోపై వేటు వేసినట్లు తెలుస్తోంది. గతంలో డీటీవో లక్ష్మికి వరంగల్ కలెక్టర్ నుంచి షోకాస్ నోటీసులు సైతం అందాయి. తాజాగా ఆమెను డీటీవోగా తప్పిస్తూ ఉత్తర్వులు జారీకావడం కలకలం రేపుతోంది. వరంగల్ ఇన్‌చార్జి డీటీవోగా ఎంవీఐ శోభన్ బాబుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

Tags:

బిగ్ బ్రేకింగ్‌.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్

మాజీ జిల్లా రవాణాశాఖ అధికారి గౌస్ పాషా ఇంట్లో త‌నిఖీలు గ‌త సంవ‌త్స‌రం అవినీతి ఆరోప‌ణ‌ల‌పై డీటీవో సస్పెన్ష‌న్‌ సుమారు రూ. 3 కోట్ల‌పైనే అక్ర‌మాస్తులు.. అక్ష‌ర‌ద‌ర్బార్‌,...
క్రైమ్  వరంగల్ 
Read More...
బిగ్ బ్రేకింగ్‌.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్

నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

విచారణలో రుజువైన ఆరోపణ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెన్షన్  ఉత్తర్వులు జారీ చేసిన సీపీ
క్రైమ్ 
Read More...
నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

జిల్లా జడ్జీల బదిలీలు..

  హ‌న్మ‌కొండ‌, భూపాల‌ప‌ల్లి జ‌డ్జిలు సీహెచ్ ర‌మేష్‌బాబు, నారాయ‌ణ‌బాబుకు స్థాన‌చ‌ల‌నం ఉత్త‌ర్వులు జారీచేసిన హైకోర్టు అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మ‌కొండ‌: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 38 మంది జడ్జీలను...
వరంగల్ 
Read More...
జిల్లా జడ్జీల బదిలీలు..

గుండెపోటుతో ఎంపీడీవో మృతి

చికిత్స కోసం హైదరాబాద్ బయలుదేరగా మార్గమధ్యంలో గుండెపోటు వచ్చేనెల మే లో రిటైర్డ్ కానున్న ఎంపీడీవో
క్రైమ్ 
Read More...
గుండెపోటుతో ఎంపీడీవో మృతి

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు 

అక్షరదర్బార్, హనుమకొండ : హనుమకొండ జిల్లా హసన్‌ప‌ర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు అదుపుత‌ప్పి రోడ్డుపై బోల్తా పడింది. మంగ‌ళ‌వారం ఉద‌యం...
Read More...
ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు