ఆరూరి, కడియం నమ్మకద్రోహులు.

ఆరూరి, కడియం నమ్మకద్రోహులు.

  • బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సస్పెన్షన్
  • మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

 

అవినీతి బయట పడుతుందన్న భయంతో బీజేపీలో చేరిన ఆరూరి. 

అరూరి, కడియం నమ్మక ద్రోహులు..

బీఆర్ఎస్ పార్టీ నుండి పట్టణ అధ్యక్షుడిని సస్పెండ్ చేసిన చల్లా...

అక్షర దర్బార్, పరకాల.
మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీకి నమ్మకద్రోహం చేశారని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పరకాల పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరూరి రమేష్ కు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ టికెట్ వస్తుందని  తెలిసినా కావాలనే పార్టీ నుండి తన అవినీతి బయటపడుతుందనే భయంతో ఆయన బిజెపి పార్టీలో చేరారని ఆరోపించారు. అదేవిధంగా ఎమ్మెల్యే డియం శ్రీహరి కూతురు కావ్యకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చాక కడియం శ్రీహరి నమ్మకద్రోహం చేసి తన కూతురు కావ్యతో  కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారని, వీరిని ప్రజలు ఆదరించారని, ఇలాంటి నమ్మకద్రోహులకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. 

పరకాల పట్టణ అధ్యక్షుడిని పార్టీ నుండి సస్పెండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే చల్లా..

పరకాల పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మడికొండ శ్రీనును పార్టీ నుండి, అధ్యక్ష పదవి నుండి సస్పెండ్ చేసినట్లు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రకటించారు. పార్టీలో పని చేయని వారు ఎవరున్నా పార్టీని వదిలి వెళ్లాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Tags:

నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

విచారణలో రుజువైన ఆరోపణ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెన్షన్  ఉత్తర్వులు జారీ చేసిన సీపీ
క్రైమ్ 
Read More...
నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

జిల్లా జడ్జీల బదిలీలు..

  హ‌న్మ‌కొండ‌, భూపాల‌ప‌ల్లి జ‌డ్జిలు సీహెచ్ ర‌మేష్‌బాబు, నారాయ‌ణ‌బాబుకు స్థాన‌చ‌ల‌నం ఉత్త‌ర్వులు జారీచేసిన హైకోర్టు అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మ‌కొండ‌: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 38 మంది జడ్జీలను...
వరంగల్ 
Read More...
జిల్లా జడ్జీల బదిలీలు..

గుండెపోటుతో ఎంపీడీవో మృతి

చికిత్స కోసం హైదరాబాద్ బయలుదేరగా మార్గమధ్యంలో గుండెపోటు వచ్చేనెల మే లో రిటైర్డ్ కానున్న ఎంపీడీవో
క్రైమ్ 
Read More...
గుండెపోటుతో ఎంపీడీవో మృతి

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు 

అక్షరదర్బార్, హనుమకొండ : హనుమకొండ జిల్లా హసన్‌ప‌ర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు అదుపుత‌ప్పి రోడ్డుపై బోల్తా పడింది. మంగ‌ళ‌వారం ఉద‌యం...
Read More...
ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు 

అంజన్న దేవాలయంలో మహా అన్నదానం..

అంజన్న దేవాలయంలో మహా అన్నదానం..    అంజన్న ఆశీస్సులు తండా ప్రజలమీద ఉండాలి.    - మాజీ సర్పంచ్ భూక్యా రమేష్    అక్షర దర్బార్, శాయంపేట     అంజన్న ఆశీస్సులు తండా...
Read More...
అంజన్న దేవాలయంలో మహా అన్నదానం..