మకాం మార్చిన ఇసుక మాఫియా

మకాం మార్చిన ఇసుక మాఫియా

  • అక్రమ సంపాదనకై మహదేవపూర్ కు షిఫ్ట్
  • ఓం ఇసుక ట్రాక్టర్ పట్టివేత 
  • మూడు రోజుల నుంచి జోరుగా రవాణా?

మకాం మార్చిన ఇసుక మాఫియా...!!!

* అక్రమ సంపాదనకై మహదేవపూర్​ కు షిఫ్ట్
​ 
* మహదేవపూర్​ లో ఇసుక ట్రాక్టర్​ పట్టివేత
 
* మూడు రోజులుగా కుదురుపల్లి నుండి జోరుగా అక్రమ ఇసుక రవాణా...?

 * కేసు నుండీ తప్పించాలంటూ అధికారులతో మంతనాలు 

అక్షర దర్బార్​, కాటారంః
భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని విలాసాగర్​ నుండి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తూ అక్రమార్జనకు తెగపడ్డారు. ఈ విషయమై 'అక్షర దర్బార్'​ పత్రికలో వరుస కథనాలు వెలువడగా స్పందించిన పోలీస్​ యంత్రాంగం విలాసాగర్​ నుండీ అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని కేసులు నమోదు చేశారు. కొందరు అక్రమార్కులు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంపులుగా ఏర్పాటుచేసుకుని వరంగల్​,హైదరాబాద్​ లాంటి నగరాలకు లారీల్లో తరలిస్తూ సొమ్ముచేసుకున్నారు.ఈ నేపథ్యంలో స్పందించిన కాటారం పోలీసులు అక్రమ ఇసుక రవాణా ఉక్కుపాదం మోపి కేసులు నమోదు చేయగా సదరు ఇసుక స్మగ్లర్లు మకాం మార్చారు.మహదేవపూర్​ మండలం కేంద్రంగా అర్థరాత్రుల్లో ఇసుక తరలింపుకై పన్నాగం పన్ని అక్రమార్గంలో ఇసుకను తరలిస్తుండగా ఆదివారం రెండ్​ హ్యాండెడ్​ గా ఓ ట్రాక్టర్​ పట్టుబడింది.కాగా ఆ ట్రాక్టర్​ కాటారం మండలంలోని గంగారం గ్రామానికి చెందిన వ్యక్తిదిగా తెలుస్తోంది.


సండే కలిసొస్తుందనే పక్కా ప్లాన్ 

 
 ఆదివారం అధికారులు అందుబాటులో ఉండరనే పక్కా ప్రణాళికతో కాటారం మండలానికి చెందిన కొందరు వ్యక్తులు తమ ట్రాక్టర్లను కుదురుపల్లిలోని ఇసుకను  అర్థరాత్రి నుండి అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం. అక్రమార్జనకై బానిసైన సదరు వ్యక్తులు కాటారం మండలంలో  ఇసుక రవాణాను బంద్​ చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు.దీంతో ఏమైనా సరే తగ్గేదెలే అంటూ మహదేవపూర్​ మండలమే తమ అక్రమార్జనకు అనువైన ప్రాంతమని భావించి సంబంధిత అధికారులకు ముందుగానే సమాచారం అందించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో  ఆదివారం అనువైన సమయమైన మేం ఆఫ్​ డ్యూటి అని చెప్పుకోవచ్చనీ మీ పని మీరు చేసుకోండి మాకేమైనా ఉంటే చూసుకోండంటూ సదరు అక్రమ ఇసుక రవాణా వ్యక్తులకు ముందస్తూ సంకేతాలు కింది స్థాయి ఉద్యోగుల తో సంబంధిత అధికారులు చెప్పించినట్లు తెలుస్తోంది.అయితే విషయం కాస్తా స్థానిక మీడియాకు తెలియడంతో స్వయంగా ఆ రిపోర్టర్లు అధికారులకు సమాచారం అందించగా ఏం చేయలేని స్థితిలో ట్రాక్టర్​ ను పట్టుకున్నట్లుగా తెలుస్తున్నది.కాగా పట్టుబడిన ట్రాక్టర్​ యజమాని తన బంధువులైన రాజకీయ నాయకుల అండదండలతో కేసు నుండీ తప్పించుకునేందుకు మంతనాలు జరిపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Tags:

జిల్లా జడ్జీల బదిలీలు..

  హ‌న్మ‌కొండ‌, భూపాల‌ప‌ల్లి జ‌డ్జిలు సీహెచ్ ర‌మేష్‌బాబు, నారాయ‌ణ‌బాబుకు స్థాన‌చ‌ల‌నం ఉత్త‌ర్వులు జారీచేసిన హైకోర్టు అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మ‌కొండ‌: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 38 మంది జడ్జీలను...
వరంగల్ 
Read More...
జిల్లా జడ్జీల బదిలీలు..

గుండెపోటుతో ఎంపీడీవో మృతి

చికిత్స కోసం హైదరాబాద్ బయలుదేరగా మార్గమధ్యంలో గుండెపోటు వచ్చేనెల మే లో రిటైర్డ్ కానున్న ఎంపీడీవో
క్రైమ్ 
Read More...
గుండెపోటుతో ఎంపీడీవో మృతి

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు 

అక్షరదర్బార్, హనుమకొండ : హనుమకొండ జిల్లా హసన్‌ప‌ర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు అదుపుత‌ప్పి రోడ్డుపై బోల్తా పడింది. మంగ‌ళ‌వారం ఉద‌యం...
Read More...
ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు 

అంజన్న దేవాలయంలో మహా అన్నదానం..

అంజన్న దేవాలయంలో మహా అన్నదానం..    అంజన్న ఆశీస్సులు తండా ప్రజలమీద ఉండాలి.    - మాజీ సర్పంచ్ భూక్యా రమేష్    అక్షర దర్బార్, శాయంపేట     అంజన్న ఆశీస్సులు తండా...
Read More...
అంజన్న దేవాలయంలో మహా అన్నదానం..

గొడ్డలితో నరికి చంపారు .. మానుకోట జిల్లాలో దారుణం

అక్ష‌ర‌ద‌ర్బార్‌, మ‌హబూబాబాద్‌: మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్య‌క్తి దారుణ హత్యకు గుర‌య్యాడు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని భజన తండా శివారులో టీ పార్థసారథి (42) అనే వ్యక్తిని...
క్రైమ్  వరంగల్ 
Read More...
గొడ్డలితో నరికి చంపారు .. మానుకోట జిల్లాలో దారుణం